నూతన వసతి గృహాలను ప్రారంభించిన మంత్రి సీతక్క

78చూసినవారు
ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బీఈడీ కళాశాలలో నూతనంగా నిర్మించిన బాలికల వసతి గృహాన్ని శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం స్థానిక వికాసం పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్య అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్