ఆర్కే 5 గనిపై చోరీ

63చూసినవారు
ఆర్కే 5 గనిపై చోరీ
శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 5 గని పై చోరీ జరిగింది. గనిపై కార్మికులు తమ సామాగ్రిని భద్రపరచుకొని ట్రంకు పెట్టెలను పగలగొట్టి దొరికిన కాడికి దొంగలు దోచుకెళ్లారు. డ్యూటీ ముగించుకొని కార్మికులు వచ్చేసరికి తాళాలు పగలగొట్టి తెరిచి ఉన్నాయి. రూ. మూడు లక్షల విలువ చేసే సెల్ ఫోన్లు, పదివేల నగదు, కొన్ని బైక్ కీలు చోరీకి గురయ్యాయని బాధితులు గని అధికారులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్