పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య

9869చూసినవారు
పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య
హాజీపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బైకం కీర్తన అనే డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కొంత కాలంగా చదువు పక్కనపెట్టి టీవీ చూడటం, మొబైల్ ఫోన్ తో గడుపుతుండటంతో మంగళవారం తండ్రి కుమార్ మందలించడంతో పురుగుల మందు తాగింది. వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఏఎస్సై చాంద్ పాషా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్