భైంసాలో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు నిధులు మంజూరు

57చూసినవారు
భైంసాలో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు నిధులు మంజూరు
భైంసా పట్టణంలోని ఆయా కాలనీల్లో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు నిధులు మంజూరు అయినట్లు ఆదివారం మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్ తెలిపారు. 6వ వార్డుకు రూ. 45 లక్షలు, 4వ వార్డ్, 5వ వార్డ్ కు కలిపి రూ. 40 లక్షలు, గోపాల్ నగర్కు రూ. 40 లక్షలు మంజూరు కాగా,
కాలనీవాసులకు ప్రొసీడింగ్ కాపీ అందజేసినట్లు తెలిపారు. నిధులు మంజూరు చేసిన జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి సితక్కకు, సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్