చెరువులో చేపల వేటకు వెళ్లి జాలరి మృతి

1564చూసినవారు
చెరువులో చేపల వేటకు వెళ్లి జాలరి మృతి
నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామంలో చెరువులో చేపల వేటకు వెళ్లి జాలరి మృతి చెందినట్లు ఎస్సై సుమలత తెలిపారు. గ్రామానికి చెందిన పోశెట్టి అనే వ్యక్తి సోమవారం గ్రామంలోని చెరువులో చేపల వేట కోసం వెళ్ళాడు. ప్రమాదవశాత్తు వల కాలుకు చుట్టుకుని చెరువులో మునిగిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్