పద్దెనిమిదో లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీహార్లో ‘ఇండియా’ వేదిక భాగస్వాముల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. రాష్ట్రంలోని మొత్తం 40 లోక్సభ సీట్లకు గాను ఆర్జెడి 26 స్థానాల్లో పోటీ చేయనుండగా, కాంగ్రెస్, వామపక్షాలు ఐదు స్థానాల్లో పోటీచేయనున్నాయి. ఖగారియా స్థానాన్ని సిపిఐ(ఎం) కు కేటాయించగా, బెగుసరారు స్థానాన్ని సిపిఐకి.. ఆరా, కరకట్, నలందా స్థానాలను సిపిఐ(ఎంఎల్)కు కేటాయించారు.