గవర్నర్‌ను కలిసిన ఏఐఏడీఎంకే ప్రతినిధి బృందం

84చూసినవారు
గవర్నర్‌ను కలిసిన ఏఐఏడీఎంకే ప్రతినిధి బృందం
తమిళనాడులోని కళ్లకురిచి నాటు సారా ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కళ్లకురిచి ఘటనకు సంబంధించి ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి కే పళనిస్వామి ఆ పార్టీ నేతలు తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని రాజ్‌భవన్‌లో మంగళవారం కలిశారు. అనంతరం పళనిస్వామి మాట్లాడుతూ.. సీఎం స్టాలిన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ గవర్నర్‌కు తాము వినతిపత్రం సమర్పించామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్