బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదల తేదీతో స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఇందిరా గాంధీ పాలనలో 1975 జూన్ 25 నుంచి 1977 వరకు కొనసాగిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందిరాగాంధీ పాత్రలో కంగనా, జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు.