కొత్త ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్.. వంటి ప్రధాన బ్యాంకులు లాంజ్ యాక్సెస్, రివార్డ్ పాయింట్ల విషయంలో కీలక మార్పులు తీసుకొస్తున్నాయి. ఇప్పటివరకు అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను అందిస్తున్న ఎస్బీఐ బ్యాంక్.. ఇకపై ఆ తరహా రివార్డులను నిలిపివేయనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు వర్తించనున్నాయి.