పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ఏపీ హోమ్ మినిస్టర్ అనితా వంగలపూడి స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా, అన్ని కోణాల్లో జరుగుతోందని తెలిపారు. ఒక ప్రత్యేక పోలీస్ బృందం ఈ ఎంక్వయిరీని జరిపిస్తున్నామని వెల్లడించారు. ఆయన మృతిపై అపోహలకు తావులేదని ఆమె స్పష్టం చేశారు.