ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్పై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెల్తుతున్నాయి. విజయవాడ రూరల్ అంబాపురంలో అగ్రిగోల్డ్ భూమిని ఆక్రమించుకున్నారని ప్రచారం జరుగుతోంది. 2022లో రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సాయంతో అక్రమించుకున్న భూమిని జోగి రమేశ్ తన బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు అంటున్నారు. మొత్తం 56 సెంట్ల భూమిని జోగి రమేశ్ అనుచరులు కబ్జా చేశారని చెబుతున్నారు.