ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ కొత్త తరహా ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. డిస్కౌంట్లపై ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు దానిపై రూ.49 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తోంది. ఇన్స్టంట్ డిస్కౌంట్ రూ.500 దాటినప్పుడు మాత్రమే ఈ మొత్తం వసూలు చేస్తోంది. అంతకంటే తక్కువ ఉన్న సందర్భాల్లో ఈ ఫీజు నుంచి మినహాయిస్తోంది. ఇప్పటికే ఫ్లిప్కార్ట్ ఈ తరహా ఫీజు వసూలు చేస్తుండగా.. ఇప్పుడు అమెజాన్ కూడా ఆ బాటలో చేరింది.