రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్
అంబానీ దంపతులు అయోధ్య రామ మందిరానికి 33 కేజీల బంగారంతో చేసిన మూడు కిరీటాలను విరాళంగా ఇచ్చారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తాజాగా స్పష్టత వచ్చింది.
అంబానీ కానుకల విషయమై ఓ ఇంగ్లీష్ వార్తా సంస్థ రామ మందిర్ ట్రస్ట్ను సంప్రదించగా తమకు అలాంటి విరాళాలు ఏవీ అందలేదని ట్రస్ట్ సభ్యుడు తెలియజేసినట్టు సదరు వార్తా సంస్థ ప్రకటించింది.