ఉగ్ర దాడి వెనుక లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ప్రమేయం

82చూసినవారు
ఉగ్ర దాడి వెనుక లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ప్రమేయం
జమ్మూకాశ్మీర్‌లోని గందర్‌బల్‌ జిల్లాలో ఆదివారం ఉగ్రవాదులు జరిపిన దాడి వెనుక లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ దాడికి పాల్పడినట్లు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. టీఆర్‌ఎఫ్‌ చీఫ్‌ షేక్‌ సజ్జాద్‌ గుల్‌ ఈ దాడికి ప్రధాన సూత్రధారి అని, అతడి ఆదేశానుసారమే ఈ దాడులకు పాల్పడినట్లు సదరు కథనాలు నివేదిస్తున్నాయి. టీఆర్‌ఎఫ్‌ గతంలో కూడా కాశ్మీర్‌లో దాడులకు పాల్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్