రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయుల్లో ఒకరు మృతి చెందారు. కీవ్ జరిపిన క్షిపణి దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.మృతుడిని సూరత్కు చెందిన హేమిల్ అశ్విన్భాయ్ మంగుకియాగా గుర్తించారు. హేమిల్ మృతిపై విదేశాంగశాఖ స్పందిస్తూ తమకు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదని పేర్కొంది.