రూ.5 లక్షలు విరాళం ప్రకటించిన అనన్య నాగళ్ల

81చూసినవారు
రూ.5 లక్షలు విరాళం ప్రకటించిన అనన్య నాగళ్ల
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల రూ.5 లక్షల విరాళం ఇచ్చారు. ఏపీ, తెలంగాణ సీఎంల సహాయనిధికి చెరో రూ.2.50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి రెండు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున విరాళాన్ని అందజేశారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, బాలకృష్ణ, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ విరాళాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్