భార్యపై కోపంతో.. బాంబు ఉందని బెదిరింపు కాల్స్

85చూసినవారు
భార్యపై కోపంతో.. బాంబు ఉందని బెదిరింపు కాల్స్
హైదరాబాద్ లోని ప్రజా భవన్, నాంపల్లి కోర్టులో బాంబులు పెట్టానంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు చెప్పిన సమాధానంతో పోలీసులు షాక్ అయ్యారు. మల్కాజిగిరి సఫిల్ గూడకు చెందిన శివకుమార్ భార్యతో మనస్పర్ధలు రావడంతో ఒంటరిగా ఉంటున్నాడు. మద్యానికి బానిసైన అతను మత్తులో మంగళవారం భార్యకు ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు. ఆ కోపంలో నగరంలో పలు చోట్ల బాంబులు పెట్టానంటూ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్