TG: భద్రాచలం బిల్డింగు కూలిన ప్రమాదంఫై అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున మరో మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. నిన్న కామేశ్వరరావు అనే వ్యక్తి మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ వెలికి తీసింది. ఇవాళ ఉపేందర్ మృతదేహం లభ్యమైనట్లు గుర్తించారు. అతని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో ఆపరేషన్ ముగిసిందని అధికారులు ప్రకటించారు. కాగా ఈ ప్రమాదంలో మొదట ఏడుగురు మరణించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.