పరీక్షలో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెంది మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘట
న పెద్దవంగర మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై మహేష్ వివరాల ప్రకారం.. చిట్యాల గ్రామానికి చెందిన ఈదురు ప్రవళిక(16) మహబూబాబాద్ జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. నిన్న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెంది గురువారం ఉదయం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.