మరో వలస కార్మికుడిని కాల్చిచంపిన ఉగ్రవాదులు

79చూసినవారు
మరో వలస కార్మికుడిని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో మరో ఉగ్ర ఘటన వెలుగుచూసింది. బీహార్‌కు చెందిన వలస కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. రాజు షా అనే కార్మికుడిని లక్ష్యంగా కాల్పులు జరిపారని, తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని కశ్మీర్ జోన్ పోలీసులు ‘ఎక్స్’ వేదికగా వివరాలు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదుల గాలింపు ఆపరేషన్ జరుగుతోందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్