రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో విద్యార్థి తనువు చాలించాడు. అదే రాష్ట్రానికి చెందిన భరత్ అనే విద్యార్థి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి సన్నద్ధమవుతున్నాడు. కోటాలోని ఓ హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్న భరత్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. కాగా గత రెండు రోజుల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకోగా, ఈ ఏడాది ఇప్పటివరకూ 10 మంది సూసైడ్ చేసుకున్నారు.