BRS అధినేత కేసీఆర్కు మరో షాక్ తగలనుంది. ఇప్పటికే పలువురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరో ఐదుగురు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో గులాబీ దళంలో గుబులు పుడుతోంది. ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలిసి మరీ మీతోనే ఉంటామని చెప్పి.. మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోనే ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పార్టీకి మరో భారీ షాక్ తగిలే అవకాశాలు లేకపోలేదు.