పూణేలో నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ఇద్దరి మృతికి కారణమైన బాలుడి (17)కి జువైనల్ జస్టిస్ బోర్డు.. 15 గంటల్లోపే బెయిల్ మంజూరు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి విభాగం ఏర్పాటుచేసిన కమిటీ నివేదికలో పలు విషయాలు వెలుగుచూశాయి. బెయిల్ వ్యవహారంలో అనేక విధానపరమైన లోపాలు, నిబంధనలు పాటించకపోవడం వంటివి కమిటీ గుర్తించినట్లు ఓ అధికారి వెల్లడించారు.