బొలీవియాలో సైనిక తిరుగుబాటుకు ఆర్మీ ప్రయత్నించింది. అధ్యక్షుడి భవనంలోకి ఆర్మీ వాహనాలు దూసుకెళ్లాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్మీ జనరల్ జువాన్ జోస్ జునిగాను అరెస్టు చేశారు. బుధవారం మధ్యాహ్నం అధ్యక్ష భవనం, కాంగ్రెస్కు నిలయమైన సెంట్రల్ ప్లాజా స్క్వేర్లోకి సైనిక దళాలు చొచ్చుకెళ్లాయి. అధ్యక్ష భవనం తలుపును ఆర్మీ వాహనం ఢీకొట్టింది. అనంతరం సైనికులు లోపలకు దూసుకెళ్లారు. మరోవైపు మిలిటరీ కమాండర్గా జోస్ విల్సన్ శాంచెజ్తో అధ్యక్షుడు ఆర్స్ ప్రమాణం చేయించారు.