HYDలో పెట్టుబడి పేరుతో మోసాలు చేస్తున్న నిందితుడు శిరీష్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. చైనాకు చెందిన కొందరికి బ్యాంకు ఖాతాలు ఇచ్చినట్లు గుర్తించారు. నిందితుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.1.5 కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు.. చైనా వారితో కలిసి మోసాలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడించారు. నిందితుడు వాట్సప్, టెలిగ్రామ్, ఆన్లైన్లో ఉత్పత్తులకు రేటింగ్ ఇస్తామంటూ మోసాలకు పాల్పడినట్లు తెలిపారు.