మద్యం మత్తులో దారుణం.. భార్య గొంతు కోసి చంపిన భర్త

76చూసినవారు
మద్యం మత్తులో దారుణం.. భార్య గొంతు కోసి చంపిన భర్త
విజయవాడలో ఘోర సంఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న భర్త తన భార్యను చంపేశాడు. ఈ ఘటన టూ టౌన్‌ కొత్తపేట పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కంసాలిపేటలో ఉంటున్న బాజీ పెయింటర్‌. అతడి భార్య నగీనా ఓ సమోసాల తయారీ కేంద్రంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసైన బాజీ రోజూ భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే కత్తితో నగీనా గొంతు కోసి చంపేశాడు. పోలీసులు బాజీని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్