దారుణం.. తాగుదామని పిలిపించి అల్లుడి హత్య

58చూసినవారు
దారుణం.. తాగుదామని పిలిపించి అల్లుడి హత్య
గ్రేటర్ నోయిడాలో ఇటీవల జరిగిన హత్య గుట్టు వీడింది. ఈ హత్యను ‘‘పరువు హత్య’’గా పోలీసులు తేల్చారు. ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ నివాసి భూలేష్ కుమార్‌, ప్రీతి ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇది ప్రీతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. అయితే ఇప్పుడు అంతా కలిసిపోదామని మాయమాటలు చెప్పి.. తాగుదామని, విందుకు ఇంటికి రావాలని ప్రీతి కుటుంబం భూలేష్‌ని కోరింది. ఈ నేపథ్యంలో అత్తగారింటికి వెళ్తుండగా, అతని భార్య తండ్రి, మామ, కాంట్రాక్ట్ కిల్లర్స్ భూలేష్ ను గొంతు నులిమి చంపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్