జూలై 31 వరకూ ఇన్కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేయవచ్చు. ఈక్రమంలో సైబర్ నేరగాళ్లు కూడా కొత్త తరహా మోసానికి తెర తీస్తున్నారు. ట్యాక్స్ పేయర్లకు రిఫండ్కి సంబంధించి మొబైల్ ఫోన్లకు లింకులను ఓపెన్ చేయమని మేసేజులు పంపుతున్నారు. అయితే అలాంటి సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అధికారిక వెబ్సైట్ ద్వారా రిఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.