ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. తాజాగా జపోరిజియా రీజియన్లోని విల్నియాన్స్క్ పట్టణంపై జరిపిన క్షిపణుల దాడిలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు. మరో ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 37 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా, గత వారంలోనే 800కుపైగా బాంబులతో రష్యా విధ్వంసం సృష్టించింది. ఇవి తీరని నష్టాన్ని మిగిల్చాయి.