ఖైరతాబాద్‌ గణేశుని శోభాయాత్ర ప్రారంభం.. నిమజ్జనానికి ఏర్పాట్లు చేసిన అధికారులు

84చూసినవారు
ఖైరతాబాద్‌ గణేశుని శోభాయాత్ర ప్రారంభం.. నిమజ్జనానికి ఏర్పాట్లు చేసిన అధికారులు
ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర మంగళవారం ఉదయం ప్రారభమైంది. కమిటీ సభ్యులు సోమవారం అర్ధరాత్రే కలశపూజ చేసి గణనాథుడ్ని కదిలించి శోభాయాత్రకు సిద్ధం చేశారు. 10 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడి నిమజ్జనానికి భక్తులు భారీగా రానున్నారు. కాగా, ఈ యాత్ర సుమారు 2 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసిన 4వ నంబర్ క్రేన్ ద్వారా మ.2 గంటల లోపు గణేష్ నిమజ్జనం పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్