దారుణం: 29 గంటల ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య

52447చూసినవారు
దారుణం: 29 గంటల ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య
కేరళలోని వాయనాడ్‌లో వెటర్నరీ విద్యార్థి సిద్ధార్థన్ (20) ఫిబ్రవరి 18న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరి 16న ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు 29 గంటల పాటు సిద్ధార్థన్‌పై సీనియర్లు పాశవికంగా దాడి చేశారు. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థి బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సీఎం విజయన్ ఈ కేసును సీబీఐకి అప్పగించారు.

సంబంధిత పోస్ట్