CM సెక్యూరిటీ కాన్వాయ్‌పై దాడి

74చూసినవారు
CM సెక్యూరిటీ కాన్వాయ్‌పై దాడి
మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మంగళవారం జిరిబామ్ ప్రాంతంలో పర్యటించనున్నారు. దీంతో ఆ ప్రాంతంలో సీఎం సెక్యూరిటీ సిబ్బంది భద్రతను నిర్ధారించే పనిలో ఉండగా ఉగ్రవాదులు సోమవారం దాడి చేశారు. వారి దాడిలో మొయిరంగ్థెమ్ అజేష్‌ అనే సెక్యూరిటీ అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. భుజంపై బుల్లెట్ గాయం కావడంతో ఆయనను సహచరులు ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో పోలీస్ కమాండోలు, అస్సాం రైఫిల్స్ జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్