AP: జనసేన వీర మహిళ సుజాతకు బిగ్ షాక్ తగిలింది. కాకినాడ జిల్లాలో పిఠాపురం జనసేన వీర మహిళ సుజాత పై కేసు నమోదైంది. ఈ నెల 14 న జరిగిన జనసేన ఆవిర్భావ సభకి జ్యోతి ప్రజ్వలకు తనను కావాలని దూరం పెట్టారని పిఠాపురం జనసేన ఇంఛార్జి మారెడ్డి శ్రీనివాస్, టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ పై సుజాత అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేశారు. జనసేన పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.