అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు నిందితులకు బెయిల్

62చూసినవారు
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు నిందితులకు బెయిల్
కేంద్రమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో అరెస్టయిన ఐదుగురు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమ, శుక్రవారాల్లో దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటివరకు అస్మా తస్లీమ్, పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీశ్, నవీన్, గీత అనే ఐదుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ఇవాళ కోర్టులో హాజరు పరచగా.. జడ్జి బెయిల్ మంజూరు చేశారు.

సంబంధిత పోస్ట్