పరువు నష్టం కేసులో తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లకు ప్రత్యేక కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి కేశవ్ ప్రసాద్ ఈ పిటిషన్ను దాఖలు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ప్రతి ప్రాజెక్టుల్లో 40 శాతం కమీషన్ తీసుకుంటుందని సిద్ధరామయ్య, డీకేలు ఆరోపించారు. దీంతో వారిపై పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు.