కర్ణాటకకు చెందిన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణకు సోమవారం బెయిల్ లభించింది. ఆయన కుమారుడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రమేయం ఉన్న లైంగిక వేధింపుల బాధితురాలి కిడ్నాప్ కేసులో బెంగళూరు కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. రూ.5 లక్షల బాండ్, అంతే మొత్తానికి రెండు షూరిటీలు సమర్పించాలని హెచ్డీ రేవణ్ణను కోర్టు ఆదేశించింది. అలాగే సిట్ దర్యాప్తునకు సహకరించాలని, ఆధారాల దుర్వినియోగానికి పాల్పడవద్దని కోర్టు పేర్కొంది.