చెన్నైలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జరిగిన సమావేశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. "చెన్నైలో జరిగింది డీలిమిటేషన్ సమావేశం కాదు... చంబల్ లోయ ముఠా సమావేశం" అని హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల దారి మళ్లించేందుకే డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఈ సమావేశంతో తేలిపోయిందని అన్నారు. డిలిమిటేషన్ పై కేంద్రం ఇంకా గైడ్ లైన్స్ నిర్ణయించలేదని ఆయన స్పష్టం చేశారు.