టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు

14108చూసినవారు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు
ఐపీఎల్‌ 2021లో నేడు కేకేఆర్‌, ఆర్‌సీబీ మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన ఆర్‌సీబీ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫయర్‌-2 ఆడాల్సి ఉండగా.. ఓడిన జట్టు ఇంటిబాట పడుతుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్‌, ఆర్‌సీబీలు మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక లీగ్‌ మ్యాచ్‌ల్లో రెండుసార్లు తలపడగా.. ఇరు జట్లు చెరో విజయాన్ని నమోదు చేశాయి. ప్లేఆఫ్స్‌లో కేకేఆర్‌, ఆర్‌సీబీ తలపడడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ముఖాముఖి పోరులో ఇరుజట్లు 28 సార్లు తలపడ్డాయి. ఇందులో 13 సార్లు ఆర్‌సీబీ నెగ్గగా.. 15 సార్లు కేకేఆర్‌ విజయాలు అందుకుంది.

ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్‌ కీపర్‌), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చహల్

కేకేఆర్‌: శుబ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్‌), దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి