రెండు రోజుల పర్యటన కోసం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శుక్రవారం భారత్ చేరుకున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లా ప్రధానికి కేంద్ర సహాయ మంత్రి కృతివర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి దౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్తోపాటు ప్రధాని నరేంద్ర మోదీతో బంగ్లా ప్రధాని హసీనా సమావేశం కానున్నారు.