ఇవాళ భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రాక

58చూసినవారు
ఇవాళ భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రాక
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇవాళ భారత్‌కు రానున్నారు. ప్రధాని మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెను భారత్‌లో పర్యటించాల్సిందిగా మోదీ ఆహ్వానించారు. ఆమె వచ్చే నెలలో చైనాకు అధికారిక పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె న్యూఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఇరువురి భేటీలో ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రాంతీయ ఆంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్