40కి చేరిన కల్తీసారా మృతుల సంఖ్య

64చూసినవారు
40కి చేరిన కల్తీసారా మృతుల సంఖ్య
తమిళనాడులో కల్తీసారా బారినపడి మృత్యువాత పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురం కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. పలు ఆస్పత్రుల్లో 109 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు కుటుంబ పెద్దలను కల్తీసారా బలి తీసుకోవడంతో కరుణాపురం, చుట్టుపక్కల గ్రామాల్లో రోదనలు మిన్నంటుతున్నాయి. నిరసనలు పెల్లుబుకుతుండటంతో శాంతిభద్రతలు అదుపు తప్పకుండా రాష్ట్రప్రభుత్వం 1000 మంది పోలీసులను రంగంలోకి దింపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్