కర్ణాటక ప్రభుత్వం మందుబాబులకు షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల బస్సు, నీరు, మెట్రో ఛార్జీలు పెంచుతారనే వార్తల నేపథ్యంలో ఇప్పుడు బీరు ధరల పెరుగుదల అనేది అక్కడ హాట్ టాపిక్గా మారింది. అయితే, బీరు ధరల పెంపుపై చర్చలు జరుగుతున్నాయని, ఇంకా కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని ఎక్సైజ్ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ గురువారం వెల్లడించారు. ఒక వేళ తాజా బీర్ల ధరల పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిదే, ఏడాది వ్యవధిలో బీర్ల ధరలు పెరగడం ఇది మూడోసారి.