ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో 'కచ్చతీవు' వ్యవహారంపై విదేశాంగమంత్రి జై శంకర్ స్పందించారు. “ఇది ఇప్పటికిప్పుడు తెరపైకి వచ్చింది కాదు. దీనిపై పార్లమెంట్లో, అలాగే కేంద్రం, తమిళనాడు మధ్య చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ అంశంపై ఆ రాష్ట్ర సీఎంకు 21 సార్లు సమాధాన
మిచ్చాను. దీనికి ప్రాముఖ్యతే లేదని నాటి ప్రధానులు భావించి దానిని వదిలించుకోవాలనుకున్నారు ” అని మంత్రి వ్యాఖ్యానించారు.