స్నేహితుడిని కిరాతకంగా హత్య చేసిన కేసులో HYD జీడిమెట్ల పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుభాష్ నగర్ కు చెందిన జైలర్ సింగ్, సమీర్ స్నేహితులు. వీరికి బైక్ విషయంలో గొడవ జరగడంతో జైలర్ సింగ్, సమీర్ ను హెచ్చరించాడు. దీంతో 'నన్నే హెచ్చరిస్తావా' అని కోపం పెంచుకున్న సమీర్.. మాట్లాడుకుందామని పిలిచి తనతో తెచ్చుకున్న కత్తితో జైలర్ సింగ్ మెడపై, కడుపులో పొడిచి హత్య చేశాడు.