నేటి కాలంలో
చిరు ధాన్యాలు అత్యంత శక్తివంతమైన ఆహారంగా చెప్పాలి. ఎందుకంటే వీటిలో పోషకాలకు కొదువ ఉండదు. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు ఇవి ఒక వరంలాంటివి. పూర్వకాలంలో వీటిని ఎక్కువగా తినేవారు పండించేవారు. జొన్న, బార్లీ, రాగులు, మొక్కజొన్న మొదలైన మిల్లెట్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో చాలా ఆహారపదార్థాలు తయారుచేయవచ్చు. గుండె జబ్బులకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి.