తెలంగాణ సాధనలో అత్యంత కీలక వ్యక్తిగా
కేసీఆర్ ను గుర్తించి సన్మానించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకు
కాంగ్రెస్ కు అవకాశం రావడంతో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన ఉద్యమకారుడిగా, రాష్ట్ర తొలి సీఎం
కేసీఆర్ కాబట్టి సోనియాతోపాటు
కేసీఆర్ ను కూడా ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం పంపాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి
కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.