కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలపై ప్రధాని నరేంద్ర
మోదీ మరోసారి విమర్శలు చేశారు. పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ దేశ ప్రజలను భయపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ‘‘ఒకప్పుడు ఉగ్రవాదం పేరుతో మనల్ని బెదిరించినవారు ప్రస్తుతం ఆహార ధాన్యాల కోసం అల్లాడుతున్నారు. పాకిస్థాన్ పని అయిపోయింది. కానీ, ఆ దేశ సానుభూతిపరులైన ఎస్పీ, కాంగ్రెస్లు మాత్రం దేశాన్ని భయపెట్టే పనిలో బిజీగా ఉన్నాయి’’ అని
మోదీ ఆరోపించారు.