టీ20 వరల్డ్ కప్లో సూపర్-8కు చేరుకోవడం బిగ్ రిలీఫ్ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. 'న్యూయార్క్ పిచ్పై ఆడటం తేలికేమీ కాదు. ఇలాంటి పిచ్పైన 110+ స్కోరైనా ఛేదించడం కష్టమే. ఏ క్షణంలోనైనా ఫలితం తారుమారయ్యే ఛాన్స్ ఉంది. సూర్య, దూబే రాణించడంతో మ్యాచ్ గెలిచాం. లీగ్ దశలో మూడు మ్యాచుల్లో విజయం సాధించాం. దీంతో మరింత ఆత్మవిశ్వాసంతో సూపర్-8లో ఆడతాం' అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.