పంజాబ్‌లో ఆప్‌ పార్టీకి భారీ షాక్

67చూసినవారు
పంజాబ్‌లో ఆప్‌ పార్టీకి భారీ షాక్
లోక్‌సభ ఎన్నికల ముందు పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇవాళ ఆప్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జలంధర్ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ, జలంధర్ వెస్ట్ ఎమ్మెల్యే శీతల్ అంగురల్ కాషాయ కండువా కప్పుకున్నారు. వారిని పార్టీ కార్యదర్శి వినోద్ తావ్డే పార్టీలోకి ఆహ్వానించారు. కాగా పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాలకు ఏడో విడతలో ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్