కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై ఆప్‌ ఆందోళన

64చూసినవారు
కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై ఆప్‌ ఆందోళన
మ‌ద్యం కుంభ‌కోణం కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈడీ కస్టడీలో ఆయన ఆరోగ్యం క్షీణించిందని తెలిపింది. మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్ రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్లు పేర్కొంది. ఆయన బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ ఒకానొక సమయంలో 46 ఎంజీకి పడిపోయినట్లు తెలిపింది. ఈ స్థాయికి పడిపోవడం చాలా ప్రమాదకరమని వైద్యులు చెప్పినట్లు ఆప్‌ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్